Sunday, 16 August 2026

Tag: East Godavari

తూర్పు గోదావరి

కేశవరం వీఆర్వో వీరవేణికి ఉత్తమ ఉద్యోగి పురస్కారం

మండపేట, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): మండపేట మండలం కేశవరం గ్రామ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న పేరూరి వీరవేణికి ఉత్తమ ఉద్యోగి పురస్కారం లభించింది. రాజమహేంద్రవరంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐ.ఏ.ఎస్. చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2020 నుంచి కేశవరం గ్రామంలో వీఆర్వోగా సేవలందిస్తున్న వీరవేణి, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణతో పాటు వివిధ ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు పొందారు. ఆమె సేవలను గుర్తించి ఉత్తమ పురస్కారం ప్రదానం చేయడంపై కేశవరం గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

తూర్పు గోదావరి

రామవరంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రామవరం, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం రామవరం గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామవరం పంచాయతీ కార్యాలయంలో, శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ, మండల కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం రామవరం శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు వైజాగ్ జి.వి. గారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన నగదు బహుమతులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, అనపర్తి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, రామవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అనపర్తిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అనపర్తి, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనపర్తి ఎంపీడీవో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఏరియా ఆసుపత్రి, తిలక్ రెడ్డి వర్తక సంఘం కళ్యాణ మండపం, వెంకటరత్నపురంలో నిర్వహించిన వేడుకల్లో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో లక్ష్మీనరసపురం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇళ్ల పట్టాలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో అధిక పని దినాలు కల్పించడంలో విశేష కృషి చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించి అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం కల్పించేందుకు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, అనపర్తి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గణేష్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

కేశవరం, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి సహాయ కార్యదర్శిగా సేవలందిస్తూ, పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న పెదపాటి సూర్య గణేష్‌కు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పెదపాటి విష్ణు మాట్లాడుతూ.. సూర్య గణేష్ తనకు ఆత్మీయ తమ్ముడని, సేవా కార్యక్రమాల్లో తనతో కలిసి ముందుకు సాగుతూ సమాజ సేవ పట్ల నిబద్ధతను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. గణేష్ జీవితంలో ప్రతి అడుగు విజయవంతం కావాలని, ఆయురారోగ్యాలు, ఆనందం, ఆత్మవిశ్వాసంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సమాజ సేవ పట్ల ఆయనకున్న నిబద్ధత మరింత పెరిగి, భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలకు మార్గదర్శిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి బిక్కవోలు మండల శాఖ అధ్యక్షులు, రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత, పున్నమి ప్రతినిధి సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు కూడా పెదపాటి సూర్య గణేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని, సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొని సమాజానికి తనవంతు సేవ అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గణేష్‌కు పలువురు సేవా సమితి సభ్యులు, శ్రేయోభిలాషులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

తూర్పు గోదావరి

చోడవరపు రాజా జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో అన్నదానం

బిక్కవోలు, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి బిక్కవోలు శాఖ ఆధ్వర్యంలో బిక్కవోలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త చోడవరపు రాంబాబు, శ్రీమతి సత్యవతి దంపతుల కుమారుడు చిరంజీవి చోడవరపు రాజా జ్ఞాపకార్థం మల్లంపూడిలోని సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని సుమారు 100 మంది వృద్ధులకు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా అవసరమైన వారికి అండగా నిలవడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చోడవరపు రాజా జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించడం ద్వారా ఆయన జ్ఞాపకాలను సేవా కార్యక్రమాలతో చిరస్మరణీయంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చోడవరపు రాంబాబు, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఎన్జీఓ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు, బిక్కవోలు శాఖ అధ్యక్షులు, రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత (పిఎస్వీ), పున్నమి ప్రతినిధి సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు, శ్రీమతి మణికుమారి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.