న్యాయవ్యవస్థపై విమర్శలు అవసరమే: CJI సూర్యకాంత్
ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థను ప్రశ్నించడం, విమర్శించడం తప్పుకాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. రామ్ జెఠ్మలానీ మెమోరియల్ లెక్చర్లో ఆయన మాట్లాడుతూ, న్యాయవ్యవస్థ ప్రజల పరిశీలనకు అతీతం కాదన్నారు. తీర్పులు అనుకూలంగా రావడం కంటే న్యాయ ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉందనే విశ్వాసమే ముఖ్యమని చెప్పారు. న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, అవసరమైన సంస్కరణలు నిరంతరం కొనసాగాలని స్పష్టం చేశారు. న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం పటిష్టంగానే ఉందని పేర్కొన్నారు.


