పల్లె నిద్రతో ప్రజలకు పోలీస్ భరోసా
పోలీస్-ప్రజల మధ్య విశ్వాసాన్ని బలోపేతం చేసి సురక్షిత సమాజాన్ని నిర్మించేందుకు ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల ఆదేశాలతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా “పల్లె నిద్ర” కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారులు గ్రామాల్లో రాత్రి బసచేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, గంజాయి, జూదం, మహిళా భద్రత, బాల్యవివాహాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద కార్యకలాపాలను 112కు తెలియజేయాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, యువతను మత్తుపదార్థాలకు దూరంగా ఉంచడంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. పోలీసులకు సహకరించాలని ప్రజలను ఎస్పీ కోరారు.


