నేడు SIR ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియకు చివరి రోజు కావడంతో, మండలంలో వెరిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోందో తెలుసుకునేందుకు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మరియు తెలుగుదేశం పార్టీ నందలూరు మండల కో-క్లస్టర్ ఇంచార్జ్ చుక్క యానాది సోమవారం మండల ఎమ్మార్వో ని మర్యాదపూర్వకంగా కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో SIR ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన విధానాలను వివరించారు.
ఈ సందర్భంగా రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటరు వివరాలను ఒకసారి పరిశీలించుకుని, ఏవైనా మార్పులు అవసరమైతే ఈనెల 14వ తేదీలోపు సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ పెంచలయ్య ,కో యూనిట్ ఇన్చార్జ్ ఆవుల రమేష్ ,నీటి సంఘం అధ్యక్షులు చుక్కా కొండయ్య తదితరులు పాల్గొన్నారు



