పేదలకు గూడు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం తూడుకుర్తి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. నూతన గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, సర్పంచ్ లక్ష్మి కర్ణాకర్, ఉప సర్పంచ్ వెంకటయ్య, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొని లబ్ధిదారులను అభినందించారు.





