⛔ ఆక్రమణదారులను వెంటనే తొలగించాలి.
⛔భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్
పున్నమి న్యూస్ సూళ్లూరుపేట
📌సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని వట్రపాలెం లో ఉన్న ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి అయ్యాయని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట తహశీల్దారు కు పట్టణ సమితి శుక్రవారం వినతి పత్రం అందజేశారు.
📌సూళ్లూరుపేటలో 25వ సంవత్సరాల క్రితమే అప్పటి ఎమ్మార్వో అయినటువంటి విజయభారతి వట్రపాలెం గ్రామ సర్వే నెంబర్లు 22/16, 23, 24, 27/18 & 27/2 లలోని సుమారు 823 ఫ్లాట్లను మంజూరు చేశారని
📌అప్పటినుంచి 2010 వరకు సుమారు 120 కుటుంబాలు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, జీవనం ప్రారంభించాయని,
📌2010 నుంచి ఇప్పటివరకు సుమారు 570 కుటుంబాల వరకు నివసిస్తున్నారు.
📌గతంలో తహసిల్దారుగా ఉన్నటువంటి రవికుమార్ కొన్ని ఇండ్ల పట్టాలను రద్దు చేసియున్నారని,
📌కానీ వట్రపాలెం లే-ఔట్ కు ఆనుకుని వున్నటువంటి ఓ భూస్వామి వట్రపాలంపై కన్నేసి అందులోని ఆరు ఫ్లాట్లు వరకు ఆక్రమించుకునేందుకు ప్రయత్నం కొనసాగిస్తున్నారని,
📌2012 నుంచి ఆయా స్థలాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, అక్కడ కాపురం ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలను ఖాళీ చేయమని చెప్పి బెదిరిస్తున్నారని,
📌అలా కాకుంటే కొంత పైకము తనకు ముట్టచెబితే వారి పేరిట సదరు ప్లాట్లను పభ్రుత్వ రికార్డులలో నమోదు చేయిస్తానని,
📌కాదని మొరాయిస్తే జెసిబి తో మీ ఇండ్లను కూల్చి వేస్తానని వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సూళ్లూరుపేట తాసిల్దార్ కు తెలియజేశారు.
📌వట్రపాళెం గ్రామాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, లే-ఔట్ ను సర్వే చేయించి అక్కడ నివసిస్తున్నటువంటి కుటుంబాల వారికి న్యాయం చేయగలరని తహసిల్దార్ కు తెలిపారు.


