Sunday, 12 July 2026

Blog

హైదరాబాద్

కేటీఆర్ మీద సి ఎం రమేష్ చేసిన ఆరోపణలు నిజమే : బండి సంజయ్

పున్నమి ప్రతినిధి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావ్ మీద పార్లమెంట్ సభ్యులు సి ఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవం అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.సి ఎం రమేష్ సవాల్ కి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.వారిద్దరి మధ్య బహిరంగ ఏర్పాటు చేస్తాఅన్నారు.కేటీఆర్ తో చర్చ కి సిఎం రమేష్ ని తీసుకోని వస్తాను అని బహిరంగ చర్చ కి తేదీ సమయం కేటీఆర్ చెప్పాలన్నారు.భారత రాష్ట్ర సమితి అవినీతి పార్టీ అని, కుటుంబ పార్టీ అని ఎన్నో సార్లు చెప్పాము, ఆ పార్టీ ని బిజెపి లో కలుపుకునే ప్రసక్తే లేదు,ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ సభ లో ఇదే చెప్పారని బండి సంజయ్అన్నారు

ఖమ్మం

బోయపాటి శ్రీనివాస్ ని కలిసిన ఖమ్మం బాలయ్య

పువ్వాడ నాగేంద్ర కుమార్ (ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్) *మోతుగూడెం లో అఖండ2 చిత్రం షూటింగ్ షెడ్యూలు పూర్తి చేసుకొని మార్గమధ్యంలోనే ఖమ్మంలో ఆగి, అమ్మ మెస్ లో అభిమానులతో కలిసి లంచ్ చేసి కాసేపు నందమూరి అభిమానులతో మాట్లాడిన డైరెక్టర్ బోయపాటి శ్రీను.. సెప్టెంబర్ 25 దసరా రోజు న అఖండ టు చిత్రం రిలీజ్ అవుతుంది అని, ఆరోజు అభిమానులకీ మరియు సినీ ప్రేక్షకుల అందరికి పండగ రోజు అని ఖమ్మం బాలయ్య బాబు అభిమానులతొ బోయపాటి చెప్పటం జరిగింది… బోయపాటిని కలిసిన నల్లమల రంజిత్,చంద్రశేఖర్,సాయి తేజ, కృష్ణ, కిరణ్,శ్రీధర్,నరేష్,సతీష్,మురళి,మహేష్,గోపి తదితరులు అభిమానులు ఉన్నారు…*

ఖమ్మం

తెలంగాణ ఎరువు ల కొరత కి కారణం కేంద్రం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. మంత్రి తుమ్మల

ఖమ్మం పున్నమి ప్రతినిధి తెలంగాణ లో ఎరువు ల కొరత కి కారణం కేంద్రం నిర్లక్ష్యం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ విమర్శించారు.వర్షాకాలం ప్రారంభం కాకముందు నుండే కేంద్ర ప్రభుత్వం ని సంప్రదించిన స్పందన కరువు అయినా తుమ్మల నాగేశ్వరావ్ అన్నారు.జూన్ నెలలో 45% కొరత ఉంది అని, దీని మీద కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకి లేఖలు రాసి నట్లు తెలిపారు.

చిత్తూరు

ఏనుగుల దాడులో మామిడి తోట ధ్వంసం

పలమనేరు, జులై 27( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు రూరల్ మండలం లోని మొసలి మడుగు గ్రామ సమీపాన గల పంటపొలాలపై శనివారం రాత్రి ఏనుగులు వచ్చి గ్రామానికి ఆనుకుని ఉన్న చంద్రశేఖర్ నాయుడు అనే రైతుకు చెందిన కోత దశలో ఉన్న మామిడి కొమ్మలను విరిచేసి అందులోని కాయలను ఆరగించి మిగిలిన కాయలను నేలపాలు చేసి కాళ్ళతో తొక్కి పూర్తిగా నష్టపరచడమే కాకుండా అక్కడున్న అరటి చెట్లను కూడా పూర్తిగా విరిచేసి అందులోని కాయలను ఆరగించి మిగిలిన కాయలను నేలపాలు చేశాయి ఆ సమయం రైతు తన పొలంలోనే నివాసముంటున్న ఇంటి పక్కనే వచ్చి పంటలను నష్టపరచడం ఆ ఏనుగుల శబ్దాలకు రైతు బయటకు వచ్చి ఏనుగును చూసి వాటి గాండ్రింపులకు భయబ్రాంతులకు గురై పరిగెత్తుకుంటూ ఇంటిలోనికి వెళ్ళిపోయాడు ఆ ఏనుగులు పంటపొలాలపై దాడి చేసి తీవ్రంగా నష్టపరిచి ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన చంద్రవేణెమ్మ వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన కోత దశలో ఉన్న మామిడి కొమ్మలను విరిచేసి అందులోని కాయలను ఆరగించి మిగిలిన కాయలను నేలపాలు చేశాయి మామిడి తోటలో అమర్చిన సీసి కెమెరాను కూడా విరిచేసి నష్టపరిచాయి ఈ విషయాన్ని ఉదయం పొలంలోకి వెళ్ళి గమనించిన ఆ రైతులు కోత దశలో ఉన్న మామిడి కాయలు ఆఖరి సమయంలో రేట్లు బాగున్నాయని ఇలాంటి సమయంలో ఏనుగులు వచ్చి మాకు నష్టం కలిగించాయని ఇదివరకే అనేక సార్లు వచ్చి మా తోటలతోపాటు గ్రామంలో చాలా మంది రైతుల పంటలను కూడా నష్టపరిచాయానిఈ విదంగా గ్రామంలో ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట ప్రతి రోజూ వచ్చి పంటలను నష్టపరుస్తూనే ఉన్నాయి రైతులు పూర్తిగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారని అటవి ఏనుగులు పంటపొలాలపై రాకుండా వాటిని అటవి శాఖ అధికారులు అదుపు చేయలేకపోతున్నారని వాళ్ళు పూర్తిగా విఫలమౌతున్నారని గ్రామం లోని రైతులు వాపోతున్నారు పంటపొలాలపై ఏనుగులు రాకుండా పంటలను కాపాడటానికి ప్రభుత్వం వెంటనే స్పందించి అటవి సమీపాన గల ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు వెంటనే ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అటవి శాఖ అధికారులకు. ప్రభుత్వ పాలకులకు తెలియపరుస్తున్నా కానీ ఇంతవరకు వాటిని పట్టించుకునే నాథుడే లేరని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు రాత్రి జరిగిన విషయాన్ని అటవి శాఖ అధికారులకు తెలిపారు వారు వచ్చి నష్టమైన రైతుల పంటలను పరిశీలించి నష్టమైన పంటలకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తామని రైతులకు తెలిపారు

చిత్తూరు

పలమనేరు లయన్స్ క్లబ్ లో 70 మందికి కంటి పరీక్షలు.

పలమనేరు, జులై 27 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుప్పం పిఈఎస్ వైద్యశాల వైద్యులచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో 70 మంది కంటి రోగులు పరీక్షలు నిర్వహించుకున్నారు.వీరిలో ఎంపిక చేసిన 25 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించనునట్లు లైన్స్ క్లబ్ అధ్యక్షులు కె ఆర్ జయశంకర్, సెక్రెటరీ డాక్టర్ మహమ్మద్ తెలిపారు. ఈ శిబిరానికి దాతగా లయన్ పత్తి శ్రీనాథ్ వ్యవహరించారు.తదుపరి కంటి చికిత్స శిబిరాన్ని ఆగస్టు 24వ తేదీ ఆదివారం నిర్వహించినట్లు వారు తెలిపారు.ఇందులో వైద్యులు డాక్టర్ నారాయణ సిబ్బంది మరియు లయన్స్ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ చంద్రయ్య శెట్టి, సీనియర్ సభ్యులు ఎం శ్రీరాములు శెట్టి చంద్రమౌళి, పుగలెంది, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

పేదల ఆరోగ్యానికి అండగా సీఎం సహాయ నిధి రూ ₹6,45,000/-

చిట్వేలి పున్నమి ప్రతినిధి జూలై 27 చిట్వేల్ మండలం నాగిరిపాడు పంచాయతీ, పెద్దురు గ్రామ వాస్తవ్వులు ఎదుటి భాస్కర ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ. ₹6,45,000/-విలువగల చెక్కులు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డిమాట్లాడుతూ.“పేద కుటుంబాలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వచ్చి అండగా నిలవడం అభినందనీయం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన ఈ సహాయం ఎంతో మందికి జీవనాధారం అవుతోంది. ప్రతి అర్హునికి ఈ సాయం అందేలా మా ప్రయత్నం కొనసాగుతుంది,”అని పేర్కొన్నారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ.“చిట్వేల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించిన ఈ చెక్కులు ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం కొంతైనా తగ్గిస్తాయి. ముఖ్యమంత్రి గారి సంక్షేమ దృక్కోణం వల్లే ఇటువంటి కుటుంబాలకు వెంటనే సహాయం అందుతోంది. అని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయుకులు పాల్కొన్నారు.

ఖమ్మం

నగర ప్రజలకి మెరుగైన వసతులు కలిపించాలి కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి

పున్నమి ప్రతినిధి ఖమ్మం నగర ప్రజలకి మెరుగైన వసతులు కలిపించాలని కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి అన్నారు శనివారం ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య తో కలిసి నగరపాలక సంస్థ లో వివిధ విభాగల అధికారులు తో సమీక్సించారూ. ఈ సం దర్భము గా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి మాట్లాడుతూ పన్నులు చెల్లి స్తున్న నగర ప్రజకిమెరుగైన వసతులు కల్పించాల్సిన భాద్యత నగర పాలక సంస్థ మీద ఉంది అన్నారు. రోడ్లు, పారిశుధ్య వసతుల మీద అధికారులు దృష్టి పెట్టాలన్నారు.

తెలంగాణ మంచిర్యాల

పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి

*పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి* మంచిర్యాల, జులై 26, పున్నమి ప్రతినిధి: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ ను బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకుల ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి, నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నుండి 32 పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయనీ, అలాగే దేశంలోని 9 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ, బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రవేశ పెట్టలేరో బీసీ సమాజానికి చెప్పాలని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా, బీసీలకు ప్రజాస్వామ్య వాటా దక్కకపోవడం బాధాకరం అని అసహనం వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే దేశాన్ని, రాష్ట్రాన్ని 78 సంవత్సరాలుగా పాలిస్తున్నారనీ, దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగా మారిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సామాజిక న్యాయం అని అడుగుతున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ఎంతో, వారి వాటా అంతా అని రాజ్యాంగం చెప్తుంటే, ఈ అగ్రకులాలు బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజెల్లి వెంకటయ్య, సీనియర్ నాయకుడు కర్రె లచ్చన్న, జిల్లా కార్యదర్శి శాఖపురి భీం సేన్, నాయకులు అంకం సతీష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం టూ టౌన్ బిజెపి కమిటీ సమావేశం విజయవంతం

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఈరోజు ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారం ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు *ధనియాకుల వెంకటనారాయణ* అధ్యక్షతన ఈనెల 29వ తారీకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు *శ్రీ ఎన్ రామచంద్ర రావు* ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం విచ్చేస్తున్న సందర్భంగా, ఈ కార్యక్రమం గురించి సన్నాహక సమావేశం 53వ డివిజన్ గట్టయ్య సెంటర్ నేహా అపార్ట్మెంట్లో జరిగింది, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య పాల్గొని, ఖమ్మం టూ టౌన్ లో 15 డివిజన్లో కాను పది డివిజన్లకు సంబంధించిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, రాష్ట్ర అధ్యక్షుడికి టూ టౌన్ కమిటీ నుండి పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీతో జన సంద్రోహంతో ఆహ్వానం పలకాలని, తెలియజేశారు, ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి తోడూపు నూరి రవీందర్, 43వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి మాజీ మండల అధ్యక్షులు తాజానూత భద్రం, 44వ డివిజన్ శక్తి కేంద్రీ ఇన్చార్జి 2 టౌన్ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాసరెడ్డి, 49వ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు శక్తి కేంద్ర ఇన్చార్జి ఈశ్వర ప్రగడ రామారావు, 51వ డివిజన్ శక్తి కేంద్రీ ఇన్చార్జి కంటెస్టెడ్ కార్పొరేటర్ నక్క రవి గౌడ్, 52వ డివిజన్ సీనియర్ నాయకులు శక్తి కేంద్ర ఇన్చార్జి దాసరి మధు, 53వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి, ఖమ్మం టూ టౌన్ ట్రెజరర్ దాసరి వీరభద్రం, 54వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జిలు సీనియర్ నాయకులు మరియు ఖమ్మం టూ టౌన్ కార్యదర్శి, జిల్లెల్ల నాగరాజు, పువ్వాడ నాగేందర్, 56వ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జి సీనియర్ నాయకులు వల్లభనేని పుల్లయ్య, 57వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి టూ టౌన్ ఉపాధ్యక్షురాలు ఇనుగుర్తి ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు,

కామారెడ్డి

రామారెడ్డి గంగమ్మ వాగు నిండు కుండల మరి వాహనదారులకు ప్రజలకు ఇబ్బంది

రామారెడ్డి మండలం : రామారెడ్డి గ్రామం లో గంగమ్మ వాగు నిండు కుండల మరి రామారెడ్డి చుట్టూ పక్కన గ్రామాల ప్రజలకు మరియు వాహనదారులకు ఇబ్బంది గా మారింది అధికారుల నిర్లక్ష్యం వనాల ప్రజలు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు రామారెడ్డి చుట్టూ పక్కన పరిసర ప్రాంతాలకు చెందిన వాహనదారులు ఇప్పుడు పోసానిపెట్ గ్రామం మీదుగా కామారెడ్డి వెళ్ళాలి కావున ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలనీ కోరుకుంటూన్నారు. ఇంతటి వర్షంలో కూడా పోలీస్ సిబ్బంది ప్రజలకు సహకరించి వంతెన వరకు ఎవ్వరిని వెళ్లకుండా గ్రామ ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.