ఖమ్మం 57వ డివిజన్ వికలాంగుల కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని ఖమ్మం టూ టౌన్ బీజేపీ నాయకులు దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం బీజేపీ టూ టౌన్ ప్రధాన కార్యదర్శి, 57వ డివిజన్ ఇంచార్జ్ రుద్రగాని మాధవరావు, ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ బోయినపల్లి సురేష్, టూ టౌన్ ప్రధాన కార్యదర్శి కన్నికంటి కృష్ణాచారి, ఉపాధ్యక్షులు భూక్యా వెంకట్, పోలింగ్ బూత్ అధ్యక్షులు గండు సాయి, అఖిల్, శ్రీకాంత్, అంజి, నాగేశ్వరావు, సుబ్బు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.



