Vemsoor/ ఖమ్మం
వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ వేంసూరు మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు గొర్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ విమోచన ఉద్యమంలో అమరులైన వీరుల త్యాగాలను నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పాల నాగ సురేంద్ర రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి యామవరపు అప్పారావు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బండి వెంకటరెడ్డి, బండి ఆంజనేయులు, సీనియర్ నాయకులు భీమిరెడ్డి బాలకృష్ణారెడ్డి, దొడ్డపనేని కృష్ణయ్య, చల్లా అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



