ఉదయగిరి మండలం బండగానిపల్లిలోని గ్రామ సచివాలయం వద్ద శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ) ఆంజనేయులు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు. గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పీడీఓ ఆంజనేయులు సూచించారు.

బండగానిపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఉదయగిరి మండలం బండగానిపల్లిలోని గ్రామ సచివాలయం వద్ద శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ) ఆంజనేయులు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు. గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పీడీఓ ఆంజనేయులు సూచించారు.

