నంద్యాల: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్ల సంఘాలు, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ పీజీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వేశ్వరయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 30 మంది ఇంజనీర్లు రక్తదానం చేశారు. ఉత్తమ సేవలందించిన 7 గురు ఏఈలు, 29 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ప్రశంసా పత్రాలు, క్రీడల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈఈ రఘురామిరెడ్డి, విశ్రాంత ఇంజనీర్లకు పురస్కారాలు అందించి సత్కరించారు. అలాగే నవజీవన్ బదిరుల పాఠశాలకు రూ.12 వేల విరాళం ప్రకటించారు. విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ఇంజనీర్లు జాతి నిర్మాణానికి కృషి చేయాలని ఈఈ రఘురామిరెడ్డి పిలుపునిచ్చారు.

ఇంజనీర్లకు పురస్కారాలు.. ఘన సత్కారం
నంద్యాల: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్ల సంఘాలు, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ పీజీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వేశ్వరయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 30 మంది ఇంజనీర్లు రక్తదానం చేశారు. ఉత్తమ సేవలందించిన 7 గురు ఏఈలు, 29 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ప్రశంసా పత్రాలు, క్రీడల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈఈ రఘురామిరెడ్డి, విశ్రాంత ఇంజనీర్లకు పురస్కారాలు అందించి సత్కరించారు. అలాగే నవజీవన్ బదిరుల పాఠశాలకు రూ.12 వేల విరాళం ప్రకటించారు. విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ఇంజనీర్లు జాతి నిర్మాణానికి కృషి చేయాలని ఈఈ రఘురామిరెడ్డి పిలుపునిచ్చారు.

