*గూడూరులో ప్రతిభా పురస్కార గ్రహీతలకు సన్మానం.*
*ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులకు ఘన సత్కారం.*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 15 (గూడూర్ )*
గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ లో తూర్పు వీధి అంగనవాడి కేంద్రంలో కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పు వరకు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు, కవులకు, సామాజిక సేవా తత్పరులకు గుర్తించి వారికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు ప్రకాశం జిల్లాలలోని పలు ప్రాంతాల్లోని పదిమందికి ప్రతిభా పురష్కార కార్యక్రమం జరిగింది.
ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా నేటికీ 11 890 కార్యక్రమాలు నిర్వహించామని రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 మంది ని గుర్తించి వారికి అత్యంత ఘనంగా సన్మానం చేయడం జరిగింది ని తెలిపారు.
మంగళవారం గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ అంగన్వాడి కేంద్రంలో సంస్థ గుర్తించిన పదిమందికి గౌరవ పురస్కార కార్యక్రమం నిర్వహించి సన్మాన గ్రహీతలకు
షీల్డ్, ప్రశంసా పత్రం, మేడల్, శాలువాతో అత్యంత ఘనంగా సత్కరించారు.
అంగన్వాడి కేంద్రం ఉపాధ్యాయిని సాజిద కి కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయ పుష్కారం ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా
ముప్పవరపు హరి ప్రసాదరావు విశ్రాంత ఆర్టిసి ఎంప్లాయిస్ కార్మికుల యూనియన్ (రాష్ట్ర నాయకులు), ముప్పవరపు శ్రీనివాసరావు ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత కండక్టర్ తోపాటు, నెల్లూరు పట్టణానికి చెందిన
చిల్లకూరు ఆదినారాయణ రెడ్డి, బొగ్గారపు రాధాకృష్ణమూర్తి ( నెల్లూరు)
సూళ్లూరుపేట పట్టణానికి చెందిన డాక్టర్ బద్రి పీరాకుమార్,
తో పాటు పలువురికి అత్యంత ఘనంగా గౌరవ పురస్కారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలతో పాటు, సన్మాన గ్రహీతల బంధువులు,
ఎం వి రావు ఫౌండేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు.



