సెప్టెంబర్ 13 తాళ్లపూడి మండలం (పున్నమి ప్రతినిధి) తాళ్లపూడి: మండలంలోని వేగేశ్వరపురం గ్రామానికి చెందిన కురసాల వీర వెంకట సత్యనారాయణ (సతీష్) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
వేగేశ్వరపురంలో జరిగిన కార్యక్రమంలో సతీష్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
అనంతరం సతీష్ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా, జి. శ్రీనివాస్ నాయుడు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు భారీగా పాల్గొన్నారు. సతీష్ పార్టీలో చేరడం వల్ల గ్రామంలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని నాయకులు పేర్కొన్నారు.
Uploaded Video:

