YSRCP అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా YSRCP జిల్లా ప్రచార విభాగం కార్యదర్శిగా అప్పనపల్లి, మామిడికుదురు మండలానికి చెందిన బొంతు చంద్రశేఖర్ (చందు) గారు నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు YSRCP నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలిపారు. పి. గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రాంతానికి చెందిన బొంతు చంద్రశేఖర్ (చందు) గార్కి జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు దక్కడం పట్ల అప్పనపల్లి గ్రామ ప్రజలు, YSRCP శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి, ప్రచార కార్యక్రమాల విజయానికి ఆయన సమర్థవంతంగా పనిచేస్తారనే ఆశాభావం వ్యక్తమైంది.



