సూపర్ సిక్స్ పథకాలపై ఇంటింటా అవగాహన
కూటమి ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్న టీడీపీ శ్రేణులు
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు టీడీపీ ఆధ్వర్యంలో పాటూరు బీసీ కాలనీలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు సూచనలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 106వ బూత్లో 100 శాతం సర్వేను పూర్తి చేశారు.
బూత్ ఇన్చార్జి సాలిపాటి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల వివరాలను సేకరించడంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు మరియు ఇతర సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, పేద కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సూపర్ సిక్స్ హామీల అమలుకు కృషి చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాతలకు ఆర్థిక సహాయం, దీపం పథకం, యువతకు ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ యువతకు భృతి వంటి హామీలను ప్రజలకు వివరించారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు సూచనల మేరకు పార్టీ శ్రేణులు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలను ప్రతి కుటుంబానికి చేరువ చేస్తున్నాయని పేర్కొన్నారు.
106వ బూత్లో 100 శాతం సర్వే పూర్తి చేయడం పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలతో నిరంతరం మమేకమై ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.


