భైంసా, సెప్టెంబర్ 12: బీజేపీ పార్టీ నుంచి ఎలాంటి కార్యక్రమానికి పిలుపు లేకపోయినా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండాలనే కారణంతో తనను తెల్లవారుజామునే భైంసా పట్టణ పోలీసులు నివాసంలో ముందస్తుగా అరెస్ట్ చేశారని బీజేవైఎం తెలంగాణ నాయకుడు కొండా సాయి ప్రసాద్ గౌడ్ తెలిపారు.అరెస్టులతో ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని అడ్డుకోలేరని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపై తమ గళం మరింత బలంగా వినిపిస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు.

పిలుపు లేకున్నా ముందస్తు అరెస్ట్ ప్రజా సమస్యలపై పోరాటం ఆపేది లేదన్న కొండా సాయి ప్రసాద్ గౌడ్
భైంసా, సెప్టెంబర్ 12: బీజేపీ పార్టీ నుంచి ఎలాంటి కార్యక్రమానికి పిలుపు లేకపోయినా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండాలనే కారణంతో తనను తెల్లవారుజామునే భైంసా పట్టణ పోలీసులు నివాసంలో ముందస్తుగా అరెస్ట్ చేశారని బీజేవైఎం తెలంగాణ నాయకుడు కొండా సాయి ప్రసాద్ గౌడ్ తెలిపారు.అరెస్టులతో ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని అడ్డుకోలేరని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపై తమ గళం మరింత బలంగా వినిపిస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు.

