పెంబర్తి విశ్వకర్మీయుల ఆధ్వర్యంలో ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు
———————————————————————
పెంబర్తిలో పొలాల అమావాస్య పర్వదినం సందర్భంగా పెంబర్తి విశ్వకర్మ కుటుంబాలు ఉమ్మడిగా నగర సంకీర్తన (భజన కీర్తనలతో) గ్రామంలోని ఇరువురు చిన్న పోచమ్మ, పెద్ద పోచమ్మ దేవాలయాలను దర్శించి ఘనంగా పూజలు నిర్వహించారు. పూర్వకాలం నుండి సాంప్రదాయంగా శ్రావణ మాసంలో పోచమ్మ తల్లి దేవతలను విశ్వకర్మలు మొదట పూజలు నిర్వహించి నైవేద్యము సమర్పించిన పిదప శ్రావణ మాస పూజలు ప్రారంభమవుతాయి, తదుపరి శ్రావణమాస చివరి రోజు అయిన పొలాల అమావాస్య రోజు ఘనంగా పూజలు నిర్వహించి శ్రావణమాసానికి వీడ్కోలు జరపడం ఆనవాయితీగా వస్తున్నది. ఇట్టి కార్యక్రమాన్ని నేడు పెంబర్తి గ్రామంలో విశ్వకర్మలు ఘనంగా నిర్వహించి పోచమ్మ తల్లి దేవతలను భక్తిశ్రద్ధలతో పూజించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు అయిలా సోమబ్రహ్మచారి,అధ్యక్షులు అయిలా కృష్ణమాచారి,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మల్యాల జనార్ధనచారి,కార్యదర్శి రంగు నరసింహచారి, సంఘం నాయకులు కూరోజు బుచ్చయ్య చార,సంపతాచారి, అయిలా సోమనరసింహచారి, మాధవచారి,రుద్రోజు శ్రీనివాస చారి,మక్తాల కుమారస్వామి, నరసింహచారి,చిన్న అనంత చారి తదితరులు పాల్గొన్నారు.
పెంబర్తి గ్రామం లో ఘనంగా బోనాలు నిర్వహించిన విశ్వ కర్మీయులు
పెంబర్తి విశ్వకర్మీయుల ఆధ్వర్యంలో ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు ——————————————————————— పెంబర్తిలో పొలాల అమావాస్య పర్వదినం సందర్భంగా పెంబర్తి విశ్వకర్మ కుటుంబాలు ఉమ్మడిగా నగర సంకీర్తన (భజన కీర్తనలతో) గ్రామంలోని ఇరువురు చిన్న పోచమ్మ, పెద్ద పోచమ్మ దేవాలయాలను దర్శించి ఘనంగా పూజలు నిర్వహించారు. పూర్వకాలం నుండి సాంప్రదాయంగా శ్రావణ మాసంలో పోచమ్మ తల్లి దేవతలను విశ్వకర్మలు మొదట పూజలు నిర్వహించి నైవేద్యము సమర్పించిన పిదప శ్రావణ మాస పూజలు ప్రారంభమవుతాయి, తదుపరి శ్రావణమాస చివరి రోజు అయిన పొలాల అమావాస్య రోజు ఘనంగా పూజలు నిర్వహించి శ్రావణమాసానికి వీడ్కోలు జరపడం ఆనవాయితీగా వస్తున్నది. ఇట్టి కార్యక్రమాన్ని నేడు పెంబర్తి గ్రామంలో విశ్వకర్మలు ఘనంగా నిర్వహించి పోచమ్మ తల్లి దేవతలను భక్తిశ్రద్ధలతో పూజించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు అయిలా సోమబ్రహ్మచారి,అధ్యక్షులు అయిలా కృష్ణమాచారి,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మల్యాల జనార్ధనచారి,కార్యదర్శి రంగు నరసింహచారి, సంఘం నాయకులు కూరోజు బుచ్చయ్య చార,సంపతాచారి, అయిలా సోమనరసింహచారి, మాధవచారి,రుద్రోజు శ్రీనివాస చారి,మక్తాల కుమారస్వామి, నరసింహచారి,చిన్న అనంత చారి తదితరులు పాల్గొన్నారు.

