తాళ్పుళపూడి : పున్నమి ప్రతినిధి:
పోలవరం మండలం పంచాయతీ పరిధిలో మంగళవారం తాళ్లపూడి శ్రీ ఆర్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ రవి కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందజేశారు. అనంతరం డాక్టర్ రవి కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందితే ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం వెంకటేష్, ఎన్ మణికంఠ, చింటూ, అఖిల, గోపిక, మహిమ, హేమ, కే అశోక్, సాగర్, వెంకట్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య భరోసా..పోలవరం మండలం పోలవరం గ్రామంలో డాక్టర్ రవి కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
తాళ్పుళపూడి : పున్నమి ప్రతినిధి: పోలవరం మండలం పంచాయతీ పరిధిలో మంగళవారం తాళ్లపూడి శ్రీ ఆర్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ రవి కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందజేశారు. అనంతరం డాక్టర్ రవి కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందితే ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం వెంకటేష్, ఎన్ మణికంఠ, చింటూ, అఖిల, గోపిక, మహిమ, హేమ, కే అశోక్, సాగర్, వెంకట్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

