ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం.
కడప జిల్లా రాజంపేట మండలం టీచర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. లయన్ డాక్టర్ దగ్గుపాటి నవీన్ కుమార్ సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి టీడీపీ రాజంపేట ఇన్చార్జి, విద్యాసంస్థల అధినేత జగన్మోహన్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను సత్కరించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా, అజ్ఞానులను జ్ఞానులుగా తీర్చిదిద్దే గొప్ప బాధ్యత ఉపాధ్యాయులదని జగన్మోహన్ రాజు పేర్కొన్నారు.


