ఉత్తమ ప్రతిభా పురస్కారం అందుకున్న తుల్జా ప్రసాద్కు అభినందనలు
అబ్దుల్లాపూర్మెట్: అబ్దుల్లాపూర్మెట్ గ్రామ కార్యదర్శి తుల్జా ప్రసాద్ ఉత్తమ ప్రతిభా పురస్కారం అందుకోవడం పట్ల గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా తుల్జా ప్రసాద్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.
గ్రామ పరిపాలనలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌర సేవలు ప్రజలకు సక్రమంగా అందేలా కృషి చేయడం, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో చూపిన ప్రతిభను గుర్తించి ఈ పురస్కారం అందించినందుకు పలువురు అభినందనలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ, ప్రభుత్వ ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సేవాభావంతో పనిచేసే తుల్జా ప్రసాద్కు ఈ అవార్డు దక్కడం అభినందనీయమన్నారు. ఆయనకు లభించిన ఈ గౌరవం అబ్దుల్లాపూర్మెట్ గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తుల్జా ప్రసాద్కు ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరెన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కోరారు.



