నంద్యాల నూనెపల్లెలోని నంద్యాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాజీ సైనికులతో కలిసి పతాక వందనం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు సాధించిన స్వాతంత్ర్యాన్ని కాపాడుతూ దేశ రక్షణలో సైనికులు, మాజీ సైనికులు చేస్తున్న త్యాగాలు మరువలేనివని అన్నారు. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.మాజీ సైనికుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని, ఐఎంఏ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రంగనాయకులు, ఉపాధ్యక్షులు రామరాజు, ప్రధాన కార్యదర్శి గురవయ్య, కోశాధికారి జయరావు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నంద్యాల నూనెపల్లెలోని నంద్యాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాజీ సైనికులతో కలిసి పతాక వందనం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు సాధించిన స్వాతంత్ర్యాన్ని కాపాడుతూ దేశ రక్షణలో సైనికులు, మాజీ సైనికులు చేస్తున్న త్యాగాలు మరువలేనివని అన్నారు. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.మాజీ సైనికుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని, ఐఎంఏ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రంగనాయకులు, ఉపాధ్యక్షులు రామరాజు, ప్రధాన కార్యదర్శి గురవయ్య, కోశాధికారి జయరావు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

