ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లుకు విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, అంకితభావం, క్రమశిక్షణకు గుర్తింపుగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెరిట్ సర్టిఫికెట్ లభించింది.
కడపలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంలో చూపిన సమర్థతకు ఈ గుర్తింపు దక్కింది.ఈ సందర్భంగా ఒంటిమిట్ట సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బంది సీఐ పి. వెంకటేశ్వర్లును అభినందించారు.


