ఖమ్మం కోర్టు ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవాలని సూచించారు. వారి త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. కార్యక్రమంలో కోర్టు అధికారులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేశారు.



