నంద్యాల పట్టణంలోని 25వ వార్డులో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. పర్యటనలో భాగంగా స్థానిక హోటల్లో మంత్రి స్వయంగా దోస వేసి సందడి చేశారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

25వ వార్డులో ఇంటింటికీ తెలుగుదేశం.. ప్రజలతో మమేకమైన మంత్రి ఫరూక్
నంద్యాల పట్టణంలోని 25వ వార్డులో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. పర్యటనలో భాగంగా స్థానిక హోటల్లో మంత్రి స్వయంగా దోస వేసి సందడి చేశారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

