
పున్నమి న్యూస్ రిపోర్ట్మనుబోలు, ఆగస్టు 6:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), మనుబోలు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు KYC అప్డేషన్ మరియు సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చీఫ్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ ఎం. ముజిబుర్ రెహమాన్ గారు వినియోగదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, బ్యాంకు ఖాతాలకు KYC వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని సూచించారు. అలాగే తెలియని వ్యక్తులు పంపే సైబర్ లింకులు, OTPలు, ఫోన్ కాల్స్, మెసేజ్లు నమ్మవద్దని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ పంచుకోవద్దని అవగాహన కల్పించారు.అదేవిధంగా SBI అందిస్తున్న కొత్త బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ సౌకర్యాలు, వినియోగదారుల కోసం అమలు చేస్తున్న కొత్త పథకాలు గురించి వివరించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గూడూరు RBO శ్రీ శర్మ గారు, SBI సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు మరియు ఖాతాదారులు పాల్గొన్నారు.రిపోర్టర్:కె. విజయ కుమార్పున్నమి న్యూస్

