ప్రజావాణి, JAC వినతులపై స్పందించిన అధికార యంత్రాంగం


మేడ్చల్ / తేదీ: 30/07/2026 పున్నమి విలేకరి సందీప్
మురాహరిపల్లి డబుల్ బెడ్రూమ్ నివాస సముదాయాలలో ఎదురవుతున్న తీవ్రమైన మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి అధికారుల యంత్రాంగం కదిలింది. ఇటీవల నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో, అలాగే గడిచిన శనివారం నాడు తెలంగాణ జేఏసీ (JAC) నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి మురాహరిపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ 2BHK డైరెక్టర్ చిలుక అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రతినిధుల బృందం అధికారులను కలసి అర్జీ సమర్పించింది.
ఈ వినతులపై తక్షణమే స్పందించిన అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గారు బుధవారం మురాహరిపల్లిలోని డబుల్ బెడ్రూమ్ సముదాయాలను స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ మరియు ఇతర మౌలిక సదుపాయాల కొరతపై స్థానిక లబ్ధిదారులను, నాయకులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అలసత్వం వహించవద్దని, తక్షణమే సంబంధిత శాఖ అధికారులు రంగంలోకి దిగి పెండింగ్లో ఉన్న అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో తెలంగాణ 2BHK డైరెక్టర్స్ చిలుక అనిల్ కుమార్, వెంకటేష్, లక్ష్మి, అలీ, ద్వారక, సంతోష్, శివ శంకర్, సుజాత, నిఖిల్, రాములు, చంద్రశేఖర్లతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక లబ్ధిదారులు పాల్గొన్నారు. తమ సమస్యల పట్ల స్పందించి అధికారులను మైదానంలోకి పంపినందుకు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

