శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని వెంకటరావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేసి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేస్తున్న ఎం. తబితను ఘనంగా సన్మానించారు. మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి, ప్రధానోపాధ్యాయులు చల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆమెను శాలువా, పూలహారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యా రంగంలో పాఠశాలను అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

వెంకటరావుపల్లి పాఠశాలలో రిటైర్డ్ పీఈటీ తబితకు ఘన సన్మానం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని వెంకటరావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేసి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేస్తున్న ఎం. తబితను ఘనంగా సన్మానించారు. మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి, ప్రధానోపాధ్యాయులు చల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆమెను శాలువా, పూలహారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యా రంగంలో పాఠశాలను అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

