వరికుంటపాడు మండలం గణేశ్వరపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ క్లస్టర్ కో-కన్వీనర్ పేరం సుధాకర్ రెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరిగి, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం పార్టీ కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేస్తూ, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వరికుంటపాడులో ఇంటింటికీ టీడీపీ కరపత్రాల పంపిణీ
వరికుంటపాడు మండలం గణేశ్వరపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ క్లస్టర్ కో-కన్వీనర్ పేరం సుధాకర్ రెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరిగి, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం పార్టీ కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేస్తూ, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

