పున్నమి (ప్రతినిధి): జూన్ 28:
సింహాచలం గిరి ప్రదర్శనకు తరలివచ్చిన వేలాది మంది భక్తులకు సేవ చేయాలనే సంకల్పంతో సంకేతిక పాలిటెక్నికల్ కళాశాల ఆధ్వర్యంలో పులిహోర, చక్కర పొంగలి, దద్దోజనం మహా ప్రసాదాలను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేశారు.
ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అలసటతో వచ్చిన ప్రతి భక్తికి ఆప్యాయంగా ప్రసాదం అందిస్తూ, “మానవ సేవే మాధవ సేవ” అనే భావనను కళాశాల యాజమాన్యం ఆచరణలో చూపించింది. ప్రసాదం స్వీకరించిన భక్తులు కళాశాల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి సేవాస్ఫూర్తిని అభినందించారు.
విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక బాధ్యత, సేవా భావం, మానవత్వం కూడా అలవర్చాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రతినిధులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధంగా ప్రసాదాలను పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది.
సేవ అనేది కేవలం సహాయం మాత్రమే కాదు, మనిషి హృదయాన్ని గెలుచుకునే గొప్ప యజ్ఞం అని మరోసారి ఈ కార్యక్రమం నిరూపించింది. సింహాచలం గిరి ప్రదర్శనలో సాంకేతిక పాలిటెక్నికల్ కళాశాల చేపట్టిన ఈ మహా ప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల ప్రశంసలు అందుకుని ఆదర్శంగా నిలిచింది.

మానవసేవే – మాధవసేవ భక్తుల సేవలో సాంకేతిక పాలిటెక్నికల్ కళాశాల
పున్నమి (ప్రతినిధి): జూన్ 28: సింహాచలం గిరి ప్రదర్శనకు తరలివచ్చిన వేలాది మంది భక్తులకు సేవ చేయాలనే సంకల్పంతో సంకేతిక పాలిటెక్నికల్ కళాశాల ఆధ్వర్యంలో పులిహోర, చక్కర పొంగలి, దద్దోజనం మహా ప్రసాదాలను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అలసటతో వచ్చిన ప్రతి భక్తికి ఆప్యాయంగా ప్రసాదం అందిస్తూ, “మానవ సేవే మాధవ సేవ” అనే భావనను కళాశాల యాజమాన్యం ఆచరణలో చూపించింది. ప్రసాదం స్వీకరించిన భక్తులు కళాశాల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి సేవాస్ఫూర్తిని అభినందించారు. విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక బాధ్యత, సేవా భావం, మానవత్వం కూడా అలవర్చాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రతినిధులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధంగా ప్రసాదాలను పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది. సేవ అనేది కేవలం సహాయం మాత్రమే కాదు, మనిషి హృదయాన్ని గెలుచుకునే గొప్ప యజ్ఞం అని మరోసారి ఈ కార్యక్రమం నిరూపించింది. సింహాచలం గిరి ప్రదర్శనలో సాంకేతిక పాలిటెక్నికల్ కళాశాల చేపట్టిన ఈ మహా ప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల ప్రశంసలు అందుకుని ఆదర్శంగా నిలిచింది.

