ఇందిరానగర్లో టీడీపీ ఇంటింటి ప్రచారం.. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన
టీడీపీ ఆధ్వర్యంలో ఉదయగిరి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

ఇందిరానగర్లో టీడీపీ ఇంటింటి ప్రచారం.. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన
ఇందిరానగర్లో టీడీపీ ఇంటింటి ప్రచారం.. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన టీడీపీ ఆధ్వర్యంలో ఉదయగిరి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

