అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గం, పెద్దపప్పూరు మండలం, నామనంకపల్లి గ్రామానికి చెందిన బడిగించల అంపయ్య విద్యార్హతగా బీఎస్సీ, బీఈడీ, డీయిఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తున్నారు.
కవి, రచయితగా గుర్తింపు పొందిన అంపయ్య, తన రచనలతో పాటు సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. పున్నమి వేదికగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, సమాజంలో అవగాహన పెంపొందించడం తన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. నిజాయితీ, బాధ్యతతో సమాజానికి ఉపయోగపడే సేవలను కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.


