ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నందలూరు సివిల్ జడ్జి కోర్ట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా (ఏజీపీ) నియమితులైన వి. వినయ్ ని నందలూరు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డేవిడ్ కళ్యాణి రాజు కలసి నందలూరులో ఘనంగా శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వి. వినయ్ మాట్లాడుతూ, తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ న్యాయ వ్యవస్థకు, ప్రజలకుసేవనందిస్తానని తెలిపారు.
ఈకార్యక్రమంలోరాయలసీమ రీజినల్ డ్రగ్స్ , క్రైమ్ చైర్మన్ వీరబల్లి జయకుమార్ రెడ్డి,పఠాన్ మెహర్ ఖాన్ ,రైల్వే సీనియర్ కాంట్రాక్టర్, శివన్,
కత్తి చంద్ర తదితరులు పాల్గొన్నారు.



