టీ.ఎల్.పేటలో ఎస్ఐఆర్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు
జులై 15 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం జిల్లా :
వైరా నియోజకవర్గం ఏన్కూర్ మండలం టీ.ఎల్.పేట గ్రామంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు బాదావత్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వైరా నియోజకవర్గ ఇన్చార్జి ఆర్.జే.సీ. కృష్ణ, ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు కట్టా కృష్ణార్జున, వైరా నియోజకవర్గ నాయకులు గిరిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎల్ఓలతో సమావేశమై ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించి పర్యవేక్షించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఏన్కూర్ మండలం సీనియర్ నాయకులు యండార్తి మోహన్రావు, గిద్దగిరి సత్యనారాయణ, తిమ్మరావుపేట సర్పంచ్ గుగులోత్ సుమలత, టీ.ఎల్.పేట గ్రామ సర్పంచ్ గుగులోత్ ప్రవీణ్ నాయక్, ఉపసర్పంచ్ నామా వెంకయ్య, బీఎల్ఏ ఎస్కే ఖాసీం, గడం వెంకటేశ్వర్లు, పూర్ణకంటి నాగరాజు, మాదేని సాయి, భూక్య శివ, కోనపల్లి నరేష్, చల్లా కోటేశ్వరరావు, ఉపేందర్, బారపాటి వెంకటనారాయణ, లక్ష్మయ్య, రవి, భూక్య ధర్మా, కడియాల సుధాకర్, వినోద్, బాబూలాల్, జరపాల లింగ, అరెం కోటేష్, వాకడోత్ లక్ష్మణ్ నాయక్, ధారావత్ కృష్ణ, యేసుబాబు, రామస్వామి, ఇంజం దేవదాస్, నజీర్ తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సరిచేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.



