టీడీపీ యూనిట్ ఇంచార్జిల సమీక్షా సమావేశం
ఆత్మకూరు, (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇంచార్జిల సమావేశం అరుంధతిపాలెంలోని కోదండ రామస్వామి దేవస్థానం వద్ద నిర్వహించారు.ఈ సమావేశానికి ఆత్మకూరు టీడీపీ టౌన్ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇంచార్జిలు హాజరయ్యారు.సమావేశంలో పాల్గొన్న యూనిట్ ఇంచార్జిలు, వార్డు బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, వార్డు అధ్యక్షులు, తెలుగు యువత నాయకులు తమ తమ వార్డుల పరిధిలోని సమస్యలను చర్చించి, వాటిని సమావేశ తీర్మానంలో పొందుపరిచారు.పార్టీ సంస్థాగత బలోపేతం, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజలతో మరింత అనుసంధానం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, టౌన్ కోశాధికారి ఉసిరిపాటి బాలకొండయ్య, టౌన్ క్లస్టర్ ఇంచార్జ్ పొట్టిపోగు సాగర్, టౌన్ యూనిట్ ఇంచార్జ్ తాటిపర్తి పెంచలయ్య, వార్డు అధ్యక్షులు గొర్రిపర్తి నాగభూషణమ్మ, టౌన్ తెలుగు యువత అధ్యక్షులు తోట సందీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి దండు ప్రవీణ్ కుమార్, బూత్ కన్వీనర్లు తాటిపర్తి పెంచలయ్య, ఈగా భాస్కర్ రెడ్డి, ఉదయగిరి సుధాకర్, పేమల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


