జంగాలపల్లిలో ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న నేతలు
దుత్తలూరు మండలం జంగాలపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయబద్ధంగా దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కాడెద్దులతో పొలంలో దుక్కి దున్ని సాగు పనులను ప్రారంభించారు. రైతే దేశానికి వెన్నుముక అనే నమ్మకంతో ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అన్నదాత సుఖీభవ, ఎరువుల సరఫరా, వ్యవసాయ పనిముట్లు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంతో అధిక ఆదాయం సాధించాలని రైతులకు సూచించారు.

జంగాలపల్లిలో ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న నేతలు
జంగాలపల్లిలో ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న నేతలు దుత్తలూరు మండలం జంగాలపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయబద్ధంగా దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కాడెద్దులతో పొలంలో దుక్కి దున్ని సాగు పనులను ప్రారంభించారు. రైతే దేశానికి వెన్నుముక అనే నమ్మకంతో ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అన్నదాత సుఖీభవ, ఎరువుల సరఫరా, వ్యవసాయ పనిముట్లు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంతో అధిక ఆదాయం సాధించాలని రైతులకు సూచించారు.

