లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించి కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. భవనంలో గ్రాఫిక్స్, యానిమేషన్ శిక్షణ కేంద్రం, లైబ్రరీ, పెట్ షాప్ నిర్వహిస్తున్నారు. మంటలు చెలరేగిన వెంటనే కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం నుంచి దూకారు. 12 అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.

లక్నోలో ఘోర అగ్నిప్రమాదం.. 15 మంది మృతి, ఎక్కువ మంది విద్యార్థులే
లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించి కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. భవనంలో గ్రాఫిక్స్, యానిమేషన్ శిక్షణ కేంద్రం, లైబ్రరీ, పెట్ షాప్ నిర్వహిస్తున్నారు. మంటలు చెలరేగిన వెంటనే కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం నుంచి దూకారు. 12 అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.

