పున్నమి ప్రతినిధి, వెదురు కుప్పం
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం గుర్రం వారి కండ్రిగలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు శ్రీ లక్ష్మీ గ్రూప్స్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రి పంపిణీ గుర్రం వారి కండ్రిగ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శ్రీ లక్ష్మీ గ్రూప్స్ అధినేత కే. ప్రసాద్ ఆధ్వర్యంలో పుస్తకాలు, పెన్నులు, నోట్బుక్స్, స్కూల్ అవసరాలకు సంబంధించిన ఇతర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థులకు ఒక సంవత్సరం పాటు ఉపయోగపడే విధంగా ఈ సామగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా కే. ప్రసాద్ మాట్లాడుతూ, “నేటి చిన్నారులే రేపటి భారతదేశ భవిష్యత్తు. విద్య అనేది ప్రతి చిన్నారి హక్కు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. సమాజ సేవలో భాగంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తాము” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గ్రూప్స్ సిబ్బంది సోము, బన్నీ, శివ, పురుషోత్తం పాల్గొని విద్యార్థులకు సామగ్రి పంపిణీ చేయడంలో సహకరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నందగోపాల్ , ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


