కర్నూలు జిల్లాలో ప్రభుత్వ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మరియు ట్రైనర్ దామోదర్ రావు గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, ప్రతి చిన్నారికి విద్య హక్కు, మరియు బాల్యాన్ని రక్షించాల్సిన సమాజ బాధ్యత వంటి అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.
దామోదర్ రావు మాట్లాడుతూ “బాల్యాన్ని రక్షించండి, చదువును అందించండి – బాల కార్మికులకు నో చెప్పండి” అనే సందేశాన్ని అందించారు. పిల్లలు విద్య ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, సమాజం ప్రతి చిన్నారి విద్యాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బాల కార్మిక వ్యతిరేక నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం చివర్లో బాల్య సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు.
Video Link:
https://youtube.com/shorts/Z1IR2AsgzME?si=0BdytKtPjDB1HWoD




