కేరళలోని వయనాడ్ జిల్లాలో అడవి ఏనుగు దాడిలో 65 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. జనావాస ప్రాంతంలోకి వచ్చిన ఏనుగును తరిమివేసే ప్రయత్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇటీవల ఇడుక్కిలో కూడా ఇలాంటి ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. వరుస సంఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఏనుగుల దాడులను అరికట్టేందుకు 500 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది.


