

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి పులి ప్రియాంక అనిల్ గారు ఈ రోజు బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దంపతులు ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం తీసుకుని, శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు శ్రీమతి పులి ప్రియాంక అనిల్ గారిని అభినందిస్తూ, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
నూతన చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి, పదవిలో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

