నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయపాళెంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. వైసీపీ మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిపోయిన ప్రసాద్, ఆయన సోదరుడు ఉమామహేశ్వరరావు తమ అనుచరులతో కలిసి టీడీపీ మాజీ సర్పంచ్, దళిత నాయకుడు అరగల కృష్ణయ్యపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణయ్య ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బాధితుడిని పరామర్శించి, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు.


