తల్లికి వందనం నిధులపై కీలక అప్డేట్
జూన్ 19న తల్లుల ఖాతాల్లో “తల్లికి వందనం” నిధులు జమ చేసే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
📚 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు అందించే ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన నిర్వహిస్తున్నారు.
✅ అనర్హులు జాబితాలో చేరకుండా…
✅ అర్హులందరికీ న్యాయం జరిగేలా…
✅ 60 లక్షలకు పైగా లబ్ధిదారుల వివరాల ధృవీకరణ కొనసాగుతోంది…
అందువల్ల ముందుగా భావించిన జూన్ 12 తేదీకి బదులుగా జూన్ 19న నిధుల విడుదలకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
💰 అర్హుల జాబితా ఖరారైన వెంటనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

