పశ్చిమ బెంగాల్లో మహిళలకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీ అమలు దశకు చేరుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లక్ష్మీర్ భండార్ పథకం కింద అందుతున్న ₹1,500ను ₹3,000కు పెంచే అన్నపూర్ణ యోజన కోసం కొత్త దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. లబ్ధిదారుల అర్హతను నిర్ధారించేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయి ధృవీకరణ చేపడుతోంది. సుమారు 2 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకం అమలైతే రాష్ట్ర ఖజానాపై సంవత్సరానికి ₹72,000 కోట్ల భారం పడే అవకాశం ఉంది. దీంతో ఈ పథకం అమలు ఆర్థిక, పరిపాలనా పరంగా ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది.

అన్నపూర్ణ యోజన అమలు బెంగాల్ ప్రభుత్వానికి సవాల్
పశ్చిమ బెంగాల్లో మహిళలకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీ అమలు దశకు చేరుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లక్ష్మీర్ భండార్ పథకం కింద అందుతున్న ₹1,500ను ₹3,000కు పెంచే అన్నపూర్ణ యోజన కోసం కొత్త దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. లబ్ధిదారుల అర్హతను నిర్ధారించేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయి ధృవీకరణ చేపడుతోంది. సుమారు 2 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకం అమలైతే రాష్ట్ర ఖజానాపై సంవత్సరానికి ₹72,000 కోట్ల భారం పడే అవకాశం ఉంది. దీంతో ఈ పథకం అమలు ఆర్థిక, పరిపాలనా పరంగా ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది.

