ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 28 (పున్నమి ప్రతినిధి)
భారతదేశాన్ని చుట్టి రావడమే తన లక్ష్యమని ప్రముఖ భారతీయ అల్ట్రా మారథాన్ రన్నర్ సూఫియా తెలిపారు. కన్యాకుమారి నుంచి కారకోరం వరకు పరుగెత్తుతూ బుధవారం మనుబోలుకు చేరుకున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్కు చెందిన ఆమె ఇప్పటికే ఐదు గిన్నిస్ రికార్డులు సాధించినట్లు తెలిపారు. 2019లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, 2021లో స్వర్ణ చతుర్భుజి రహదారిపై వేగవంతమైన పరుగుతో గిన్నిస్ రికార్డులు సాధించారు. ప్రస్తుతం కన్యాకుమారి నుంచి లడక్లోని కారకోరం వరకు 4 వేల కిలోమీటర్లు పరుగెత్తి ఆరో గిన్నిస్ రికార్డు సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

మనుబోలుకు చేరుకున్న అల్ట్రా మారథాన్ రన్నర్ సూఫియా
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 28 (పున్నమి ప్రతినిధి) భారతదేశాన్ని చుట్టి రావడమే తన లక్ష్యమని ప్రముఖ భారతీయ అల్ట్రా మారథాన్ రన్నర్ సూఫియా తెలిపారు. కన్యాకుమారి నుంచి కారకోరం వరకు పరుగెత్తుతూ బుధవారం మనుబోలుకు చేరుకున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్కు చెందిన ఆమె ఇప్పటికే ఐదు గిన్నిస్ రికార్డులు సాధించినట్లు తెలిపారు. 2019లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, 2021లో స్వర్ణ చతుర్భుజి రహదారిపై వేగవంతమైన పరుగుతో గిన్నిస్ రికార్డులు సాధించారు. ప్రస్తుతం కన్యాకుమారి నుంచి లడక్లోని కారకోరం వరకు 4 వేల కిలోమీటర్లు పరుగెత్తి ఆరో గిన్నిస్ రికార్డు సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

