శ్రీ కాళహస్తి, మే 27, (పున్నమి న్యూస్) : మహానాడు–2026 ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన నివాసంలో పార్టీ పసుపు జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల నినాదాలతో కార్యక్రమం సందడిగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పసుపు జెండా కోట్లాది మంది కార్యకర్తల విశ్వాసానికి, ప్రజా సేవా తపనకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ‘సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు’ అనే మహోన్నత సిద్ధాంతంతో ప్రజా రక్షణ పాలన అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి కార్యకర్త పాత్ర కీలకమని పేర్కొన్న ఆయన.. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మహానాడు వేళ శ్రీకాళహస్తిలో టీడీపీ జెండా ఆవిష్కరణ
శ్రీ కాళహస్తి, మే 27, (పున్నమి న్యూస్) : మహానాడు–2026 ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన నివాసంలో పార్టీ పసుపు జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల నినాదాలతో కార్యక్రమం సందడిగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పసుపు జెండా కోట్లాది మంది కార్యకర్తల విశ్వాసానికి, ప్రజా సేవా తపనకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ‘సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు’ అనే మహోన్నత సిద్ధాంతంతో ప్రజా రక్షణ పాలన అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి కార్యకర్త పాత్ర కీలకమని పేర్కొన్న ఆయన.. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

