ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 25 (మల్లికార్జునరావు పున్నమి ప్రతినిధి)
మనుబోలు: వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు, తల్లిదండ్రులు విద్యుత్ పరికరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏపీఎస్పీడీసీఎల్ ఏఈ అనిల్ కుమార్ సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని, గాలిపటాలు విద్యుత్ లైన్లకు చిక్కితే తాకవద్దని హెచ్చరించారు. ఇంట్లో పరికరాలు వాడేటప్పుడు తడి చేతులతో తాకకూడదని తెలిపారు. తీగలు తెగిపడితే వెంటనే సమాచారం ఇవ్వాలని, అత్యవసరంగా 1912కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రజల సహకారం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు.

వేసవి సెలవుల్లో విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: ఏఈ అనిల్ కుమార్
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 25 (మల్లికార్జునరావు పున్నమి ప్రతినిధి) మనుబోలు: వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు, తల్లిదండ్రులు విద్యుత్ పరికరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏపీఎస్పీడీసీఎల్ ఏఈ అనిల్ కుమార్ సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని, గాలిపటాలు విద్యుత్ లైన్లకు చిక్కితే తాకవద్దని హెచ్చరించారు. ఇంట్లో పరికరాలు వాడేటప్పుడు తడి చేతులతో తాకకూడదని తెలిపారు. తీగలు తెగిపడితే వెంటనే సమాచారం ఇవ్వాలని, అత్యవసరంగా 1912కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రజల సహకారం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు.

