శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) జాతీయ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ల వద్ద అగ్నిమాపక సిబ్బంది ప్రయాణికులకు, స్థానికులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక కేంద్రాధికారి ఎన్. నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో సిబ్బంది అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కరపత్రాల ద్వారా వివరించారు. కేవలం మాటలతోనే కాకుండా, ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి? చిక్కుకున్న వారిని సురక్షితంగా ఎలా బయటకు తీసుకురావాలి (రెస్క్యూ) అనే అంశాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ మంటలను ఆర్పే విధానం, షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు స్పందించే తీరుపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారి నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. “అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు లోనుకాకుండా ప్రాథమిక అవగాహనతో వ్యవహరిస్తే భారీ ఆస్తి, ప్రాణ నష్టాలను అరికట్టవచ్చు” అని తెలిపారు. ప్రతి ఒక్కరూ అగ్నిమాపక నిబంధనలను పాటించాలని, అత్యవసర సమయాల్లో వెంటనే 101 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బందితో పాటు ప్రయాణికులు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.

ప్రమాదం జరిగినప్పుడు వణకవద్దు.. మెళకువలతో అరికట్టండి-అగ్నిమాపక అధికారి
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) జాతీయ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ల వద్ద అగ్నిమాపక సిబ్బంది ప్రయాణికులకు, స్థానికులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక కేంద్రాధికారి ఎన్. నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో సిబ్బంది అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కరపత్రాల ద్వారా వివరించారు. కేవలం మాటలతోనే కాకుండా, ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి? చిక్కుకున్న వారిని సురక్షితంగా ఎలా బయటకు తీసుకురావాలి (రెస్క్యూ) అనే అంశాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ మంటలను ఆర్పే విధానం, షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు స్పందించే తీరుపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారి నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. “అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు లోనుకాకుండా ప్రాథమిక అవగాహనతో వ్యవహరిస్తే భారీ ఆస్తి, ప్రాణ నష్టాలను అరికట్టవచ్చు” అని తెలిపారు. ప్రతి ఒక్కరూ అగ్నిమాపక నిబంధనలను పాటించాలని, అత్యవసర సమయాల్లో వెంటనే 101 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బందితో పాటు ప్రయాణికులు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.

