Wednesday, 15 April 2026
  • Home  
  • మనిషి కోసం మనిషిగా నిలుద్దాం.. ప్రాణదాతలుగా మారుదాం: అంబేద్కర్ యువజన సంఘం
- తిరుపతి

మనిషి కోసం మనిషిగా నిలుద్దాం.. ప్రాణదాతలుగా మారుదాం: అంబేద్కర్ యువజన సంఘం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. స్థానిక అంబేద్కర్ యువజన సంఘం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన (రజతోత్సవం) సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. “మనిషి కోసం మనిషిగా నిలుద్దాం.. రక్తదానం చేసి ప్రాణదాతలు అవుదాం” అన్న సంఘం పిలుపు మేరకు సుమారు 60 మంది యువకులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ సంఘం సభ్యులు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఒక్క అంబేద్కర్‌కే దక్కుతుందని కొనియాడారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని, దేశ స్వపరిపాలనకు దిక్సూచిగా రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడని వారు పేర్కొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గడిచిన 25 ఏళ్లుగా సేవా రంగంలో కొనసాగుతున్న అంబేద్కర్ యువజన సంఘం, భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తుందని సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు డాక్టర్ శంకర్, రాజా, బాలాజ, సుధాకర్, శేఖర్, గణేష్, బాబి, సుభాష్, రాజేంద్ర, మనోజ్, కుమార్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. స్థానిక అంబేద్కర్ యువజన సంఘం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన (రజతోత్సవం) సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. “మనిషి కోసం మనిషిగా నిలుద్దాం.. రక్తదానం చేసి ప్రాణదాతలు అవుదాం” అన్న సంఘం పిలుపు మేరకు సుమారు 60 మంది యువకులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ సంఘం సభ్యులు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఒక్క అంబేద్కర్‌కే దక్కుతుందని కొనియాడారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని, దేశ స్వపరిపాలనకు దిక్సూచిగా రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడని వారు పేర్కొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గడిచిన 25 ఏళ్లుగా సేవా రంగంలో కొనసాగుతున్న అంబేద్కర్ యువజన సంఘం, భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తుందని సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు డాక్టర్ శంకర్, రాజా, బాలాజ, సుధాకర్, శేఖర్, గణేష్, బాబి, సుభాష్, రాజేంద్ర, మనోజ్, కుమార్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.