Tuesday, 21 April 2026
  • Home  
  • అమ్మ ఆశ్రమం రజతోత్సవ వేడుకలు: గంగపుత్ర గాంధీకి ఘన సన్మానం.
- తిరుపతి

అమ్మ ఆశ్రమం రజతోత్సవ వేడుకలు: గంగపుత్ర గాంధీకి ఘన సన్మానం.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి శీవరులో ఉన్న ‘అమ్మ ఆశ్రమం’ 25వ వార్షికోత్సవ (రజతోత్సవ) వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సమాజ సేవలో, కళారంగంలో విశేష కృషి చేస్తున్న భూలక్ష్మమ్మ, గంగపుత్ర గాంధీని ఆశ్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ….గంగపుత్ర గాంధీ తన రచనలు, పాటల ద్వారా సమాజంలోని రుగ్మతలపై నిరంతరం పోరాడుతున్నారని కొనియాడారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారి పట్ల సంతానం వహించాల్సిన బాధ్యతలను తన కలం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారని ప్రశంసించారు. పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని, అది ప్రతి బిడ్డ ప్రాథమిక ధర్మమని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. సమాజాన్ని ప్రభావితం చేసే ఇలాంటి కళాకారులను గౌరవించుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా అభాగ్యులకు అండగా నిలుస్తున్న తమ ప్రయాణంలో గంగపుత్ర గాంధీ వంటి వారి సహకారం మరువలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధులు, ప్రముఖులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి శీవరులో ఉన్న ‘అమ్మ ఆశ్రమం’ 25వ వార్షికోత్సవ (రజతోత్సవ) వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సమాజ సేవలో, కళారంగంలో విశేష కృషి చేస్తున్న భూలక్ష్మమ్మ, గంగపుత్ర గాంధీని ఆశ్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ….గంగపుత్ర గాంధీ తన రచనలు, పాటల ద్వారా సమాజంలోని రుగ్మతలపై నిరంతరం పోరాడుతున్నారని కొనియాడారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారి పట్ల సంతానం వహించాల్సిన బాధ్యతలను తన కలం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారని ప్రశంసించారు. పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని, అది ప్రతి బిడ్డ ప్రాథమిక ధర్మమని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. సమాజాన్ని ప్రభావితం చేసే ఇలాంటి కళాకారులను గౌరవించుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా అభాగ్యులకు అండగా నిలుస్తున్న తమ ప్రయాణంలో గంగపుత్ర గాంధీ వంటి వారి సహకారం మరువలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధులు, ప్రముఖులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.