Tuesday, 14 April 2026
  • Home  
  • ఢిల్లీ సీఎం రేఖ గుప్తాకు శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు
- తిరుపతి

ఢిల్లీ సీఎం రేఖ గుప్తాకు శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తిరుపతి పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఆమెకు రేణిగుంట విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా మాజీ భాజపా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా డాక్టర్ చంద్రప్ప దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టతను ఆమెకు వివరించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రాన్ని ఆమెకు బహుకరించి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆశీస్సులు అందజేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పర్యటనకు వచ్చిన ఆమెకు పలువురు నాయకులు, ప్రముఖులు విమానాశ్రయంలో శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తిరుపతి పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఆమెకు రేణిగుంట విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా మాజీ భాజపా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా డాక్టర్ చంద్రప్ప దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టతను ఆమెకు వివరించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రాన్ని ఆమెకు బహుకరించి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆశీస్సులు అందజేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పర్యటనకు వచ్చిన ఆమెకు పలువురు నాయకులు, ప్రముఖులు విమానాశ్రయంలో శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.